ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలపై బాబు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు.