కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంతో పలు అంశాల్లో తీవ్రంగా విభేదిస్తున్న డి శ్రీనివాస్.. గత కొంత కాలంగా తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా అగ్రనేత దిగ్విజయ్ సింగ్ విషయంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పిలిచినా కూడా.. మాట్లాడటం కాదు కదా, కనీసం ముఖం చూసేందుకు కూడా తనకు ఇష్టం లేదని ఆయన కటువుగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడింది దిగ్విజయ్ సింగేనన్నదే డీఎస్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.
Jun 30 2015 6:40 PM | Updated on Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement