నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం నగరంలోని విశాలాక్షినగర్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.