హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఫెడరల్ బ్యాంక్లో భారీ చోరీ జరిగింది. దుండగులు రెండోసారి బ్యాంక్పై గురిపెట్టి...అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున దుండగులు బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు కోటి విలువైన బంగారంతో పాటు నగదు చోరీకి గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. గతంలోనూ దుండుగులు ...ఈ బ్యాంక్లో చోరీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు పాత నేరస్తులపై దృష్టి సారించారు.
Dec 16 2014 10:56 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement