Fedaral bank
-
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నాలుగేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయంతో ఇప్పటివరకు 5.25-5.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 4.75-5 శాతానికి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు.ఇటీవల సింగపూర్లో జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నామని చెప్పారు. వరుసగా జులై, ఆగస్టు నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్ వర్గాలు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి ఈ సూచీనే ప్రామాణికంగా ఉండనుంది.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున సాయంరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడిచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
దివాలా దిశగా అగ్రరాజ్యం!
ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా అమెరికాకు గుర్తింపు ఉంది. అది అలా వృద్ధి చెందడానికి అప్పులు కూడా ఒక కారణం. ఏంటీ..ఆశ్చర్య పోతున్నారా? అవును..అమెరికా అప్పులతోనూ ఎదిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏటా ఆ దేశం కట్టే వడ్డీలే అందుకు నిదర్శనం. జూన్ 2024 లెక్కల ప్రకారం..దేశీయంగా వసూలైన వ్యక్తిగత ఆదాయపు పన్నులో 76 శాతం అంటే జాతీయ రుణాన్ని చెల్లించేందుకే వెచ్చిస్తోంది. ఈమేరకు ఎక్స్లో పోస్ట్లు వెలిశాయి. వాటిని ధ్రువపరిచేలా ప్రముఖ వ్యాపారవేత్త ఇలొన్మస్క్ ‘అమెరికా దివాలా దిశగా ప్రయాణిస్తోంది’ అంటూ స్పందించారు. దాంతో ఈ ట్వీట్ మరింత వైరల్గా మారింది.పెరుగుతున్న జాతీయ రుణం అమెరికాలో చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ ఈ విషయాన్ని గతంలోనూ చాలాసార్లు తెలిపారు. తాజాగా ‘అమెరికా దివాళా దిశగా వెళ్తోంది’ అంటూ పీటర్ స్టాంజ్ అనే వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్లోని వివరాలను ధ్రువపరుస్తూ స్పందించారు. అమెరికా వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లలో దాదాపు 76 శాతం జాతీయ రుణ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్లు పీటర్ చెప్పారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణం మాజీ అమెరికా అధ్యక్షులు ఫ్రాంక్లిన్ డీ రూజువెల్ట్, రిచర్డ్ నిక్సన్ అని అన్నారు.1970 కాలంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న రిచర్డ్ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మాడు. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడు. దాంతో ‘న్యూ ఫెడరలిజం’ విధానాలు అమలు చేశాడు. అందులో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడు. ఫలితంగా అమెరికా అప్పులు మూటగట్టుకుంది. రూజ్వెల్ట్ అధ్యక్ష పదవిలో ఉన్నపుడు సంపన్నులపై పన్ను రేట్లను 79%కు పెంచారు. ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దాంతోపాటు అమెరికాలో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ఉద్యోగ కల్పన కుంటుపడింది. నిరుద్యోగం పెరిగింది.America is headed for bankruptcy fyi https://t.co/O6FH5BK4aQ— Elon Musk (@elonmusk) July 26, 2024ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!పీటర్ స్టాంజ్ ఎక్స్లో అప్లోడ్ చేసిన వీడియోపై పీటర్ షిఫ్ అనే క్రిప్టో విమర్శకుడు స్పందించాడు. ‘అమెరికా అప్పులు అక్కడితో ఆగవు. త్వరలో ఫెడరల్ పన్ను ఆదాయంలో 100% రుణవడ్డీని చెల్లించడానికే వెచ్చిస్తారు. అన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు చేయాల్సిందే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం, అప్పులను పరిశీలిస్తోంది’ అన్నారు. జూన్ 2024లో యూఎస్ ప్రభుత్వం ట్రెజరీ సెక్యూరిటీలపై 140.238 బిలియన్ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) వడ్డీ చెల్లించింది. ప్రభుత్వం అదే నెలలో వ్యక్తిగత ఆదాయ పన్నుల రూపంలో 184.9 బిలియన్ డాలర్లు(రూ.15.4 లక్షల కోట్లు) వసూలు చేసింది. -
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే కీలక వడ్డీరేట్లు
రాజకీయాలతోపాటు రాష్ట్ర బాగోగులు, సమస్యలపై నిత్యం పార్లమెంట్లో పోరాడే ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రపంచ ఆర్థికవ్యవస్థపై విస్తృత పట్టు ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను తగ్గించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది.. అసలు ద్రవ్యోల్బణం ఎలా ఏర్పడుతుంది.. కార్మికుల జీతాలకు ఇన్ఫ్లేషన్కు సంబంధం ఏమిటనే అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాల్లో, చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన వర్ధమాన దేశాల్లో మధ్యతరగతి ప్రజల నుంచి ఆర్థికవేత్తల వరకూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. జనం వినియోగించే వస్తువులు, సరకుల ధరలు పెరుగడం అందరినీ వేధిస్తున్న సమస్య. అమెరికా నుంచి ఇండియా వరకూ ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులే మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఇటీవల ‘దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేకొద్దీ 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించగలం’ అని సూచనప్రాయంగా తెలిపింది. దీంతో ఇండియాలో స్టాక్ మార్కెట్లలో సూచీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్ని నిర్ణయించే ద్రవ్యోల్బణంపై తరచూ ‘ఫెడ్’ ప్రకటనలు చేస్తూ అమెరికన్లను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. ఫెడ్ సూచనలు కీలకం ప్రస్తుత ద్రవ్యోల్బోణం ఈ ఏడాది లేదా తర్వాత ఏడాది ఏ స్థాయిలో అదుపులోకి వస్తుందనే విషయంపై ఫెడ్ లేదా దాని సభ్యులు అంచనా వేసి చెబుతుంటారు. ఈ అంచనాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తోంది ఫెడ్. రాబోయే సుమారు మూడు నెలల కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు ఎలా ఉండవచ్చనే అంశంపై ప్రజలకు ఫెడ్ ముందే సూచిస్తోంది. ఇలా ద్రవ్యోల్బణంపై ఫెడ్ వేసే అంచనాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫెడ్ అభిప్రాయాలపై విస్తృతంగా చర్చలు సాగుతాయి. చివరికి ఫలానా వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే విషయంపై సగటు వినియోగదారుడు ఒక నిర్ధారణకు వస్తాడు. ఫెడ్ కీలక నిర్ణయాల వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై క్లారిటీ వస్తుంది. అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టే అంతా జరుగుతుందా అంటే, వాటిలో వివరించిననట్టు ప్రపంచం నడవదు. వాస్తవ ప్రపంచం వేరు.. వ్యాపారులు తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాలనుకున్నప్పుడు అందుకు సరిపడా కార్మికులు లేకపోతే ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు డిమాండ్ ఉండడంతో వారు అధిక వేతనాల కోసం పట్టుబడతారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దాంతో వేరే దారిలేక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు నిర్ణయిస్తారు. జీతాలు పెరగడం వల్ల కార్మికుల జేబుల్లోకి ఎక్కువ డబ్బు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ కనీస అవసరాల కోసం షాపుల్లో కొనుగోలు చేసే వస్తు ధరలు ఊహించినదాని కన్నా ఎక్కువ ఉంటాయి. వేతనాలు పెరగడంతో వచ్చిన ప్రయోజనం వస్తు ధరల పెంపుతో మాయమౌతుంది. ఇక ధరలు ఇలాగే పెరుగుతాయనే ఆందోళనతో కార్మికులు మరింత ఎక్కువ వేతనాలు కావాలంటూ ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా వర్కర్ల జీతాలతోపాటే వస్తువుల ధరలూ పెరుగుతుంటాయి. దీన్నే ‘ధరల వలయం’ అని పిలుస్తారు. ఈ రకమైన సూత్రీకరణలు అర్థసత్యాలేగాని సంపూర్ణ వాస్తవాలు కావు. సరకుల కొరత ఉన్నప్పుడు తమ లాభాలు పెంచుకోవడానికి వ్యాపారులు చేసే ప్రయత్నాల వల్ల (ధరలు పెంచడం ద్వారా) కొన్ని కాలాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిల్లో ఉంటుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే? అసలు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే ఏమిటి? అనే విషయంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఫెడ్ తన ప్రకటనలో వాడిన ఈ మాటలకు (ఇన్ఫ్లేషన్ ఈజింగ్) అర్థం–ద్రవ్యోల్బణం తగ్గిపోవడం. అంటే ధరలు తగ్గవు. గతంతో పోల్చితే ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అమెరికాలో ఇళ్లలో వాడే సరకుల ధరలు 2022లో 12% పెరగగా, గడచిన 12 మాసాల్లో కేవలం 2 శాతమే పెరిగాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ముందుకు నడిపించే ఈ దేశంలో గతేడాది ద్రవ్యోల్బణం 9.1% ఉండగా, నవంబర్లో 3.1% గా నమోదైంది. ఈ లెక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం 2024లో కూడా ఇప్పటిలా ఆశావహంగా ఉండొచ్చని అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంచనా. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP -
మా వ్యూహం అదే..టాప్–5లో ఫెడరల్ బ్యాంక్
కోల్కతా: వృద్ధి వ్యూహంలో భాగంగా తాము ఫిన్టెక్ కంపెనీలతో జట్టు కట్టనున్నట్టు ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ ప్రకటించారు. టాప్–5 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. ఫిన్టెక్ కంపెనీల భాగస్వామ్యంతో తాము పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలమన్నారు. ఫిన్టెక్ కంపెనీలతో పోటీ పడడం కంటే, వాటి సహకారానికే తాము ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బ్యాంక్ అంతర్గత వృద్ధి వ్యూహంలో ఇది భాగమన్నారు. ఫిన్టెక్లు బ్యాంక్కు గణనీయమైన విలువను తెచ్చి పెడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఖాతాల ప్రారంభం దిశగా కస్టమర్లను సొంతం చేసుకోవడానికి ఫిన్టెక్ కంపెనీలు సాయపడతాయి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ రోజూ 15,000 కొత్త ఖాతాలను తెరుస్తోంది. ఇందులో 60 శాతం ఫిన్టెక్ సంస్థల ద్వారానే వస్తున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఖాతాలు’’అని చెప్పారు. ఫిన్టెక్ కంపెనీల ద్వారా రుణాల మంజూరు అన్నది ప్రధానంగా క్రెడిట్ కార్డుల రూపంలో ఉంటున్నట్టు తెలిపారు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ, సొంతంగానే తాము వృద్ధిని సాధించగలమన్నారు. ‘‘మా పోర్ట్ఫోలియోలో 3 శాతం మేర క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాల రూపంలో అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. ఉత్పత్తులు, విభాగాలు, ప్రాంతాల వారీగా వైవిధ్యం పాటించాలన్నది మా విధానం’’అని శ్రీనివాసన్ వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు రుణ వితరణకు సబంధించి గ్రీన్ బ్యాంకింగ్పైనా తాము దృష్టి సారించినట్టు చెప్పారు. శాఖల విస్తరణ దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను తెరిచే ప్రణాళికతో ఉన్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు.‘‘ప్రస్తుతం మాకు 1408 శాఖలు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 మధ్య నాటికి మరో 250 శాఖలను తెరవాలన్నది ప్రణాళిక’’అని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ శాఖల విస్తరణ చేపడతామన్నారు. ఏటా 100 నుంచి 150 శాఖలు తెరవాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. -
బలహీనంగానే సెంటిమెంట్
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగానే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ క్యూ2 ఆరి్థక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. పశి్చమాసియా ఉద్రిక్తతలు, బాండ్లపై రాబడులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, మిశ్రమ కార్పొరేట్ ఆరి్థక ఫలితాల వెల్లడి తదితర పరిణామాల నేపథ్యంలో క్రితం వారం సూచీలు రెండున్నరశాతం నష్టపోయాయి. ట్రేడింగ్ నాలుగురోజులు జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1,615 పాయింట్లు, నిఫ్టీ 495 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ‘‘వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ఆస్థిరత కొనసాగవచ్చు. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ రికవరీని ఆలస్యం చేయోచ్చు. ఇటీవల వరుస విక్రయాలతో నెలకొన్న ఓవర్సోల్డ్ ట్రెండ్తో నిఫ్టీ పతనం తాత్కాలికంగా ఆగింది. నిఫ్టీకి సాంకేతికంగా కీలకమైన మద్దతు 19,250 స్థాయి కోల్పోయింది. తిరిగి ఈ స్థాయిపైకి చేరుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ తెలిపారు. క్యూ2 కార్పొరేట్ ఫలితాలు గత వారాంతంలో ఎన్టీపీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్లు వెల్లడించిన ఆరి్థక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీ సూచీలో లిస్టైన టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, టైటాన్, యూపీఎల్, టాటా కన్జూమర్ ప్రొడెక్టŠస్, అదానీ ఎంటర్ప్రైజెస్, బ్రిటానియాతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 700 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆరి్థక ఫలితాలను వెల్లడించనున్నాయి. గెయిల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, మనోజ్ వైభవ్ జెమ్స్, యధార్థ్ హాస్పిటల్స్, గ్లాండ్ ఫార్మా, ఐఓసీ, అంజుజా సిమెంట్స్, టీవీఎస్, ఇండిగో, జొమోటో, డెల్హవరీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీఎల్ఎఫ్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సెపె్టంబర్ ద్రవ్యలోటు, ఎనిమిది కీలక రంగాల వృద్ధి డేటా మంగళవారం(అక్టోబర్ 31న), అక్టోబర్ తయారీ రంగ పీఎంఐ, ఇదే నెల ఆటో అమ్మకాలు బుధవారం, సేవా రంగ పీఎంఐ డేటా, పారెక్స్ నిల్వలు శుక్రవారం విడుదల అవుతాయి. అమెరికా తయారీ, సేవా రంగ పీఎంఐ, ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్ ఎకానామిక్ కాని్ఫడెన్స్, కన్జూమర్ కాని్ఫడెన్స్, సీపీఐ, జీడీపీ, తయారీ రంగ గణాంకాలు ఇదే వారంలో విడుదల కానున్నాయి. చైనా తయారీ, నాన్ మాన్యూఫ్యాక్చరింగ్, సేవారంగ పీఎంఐ డేటా ఈ వారంలోనే వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబింజేసే కీలక స్థూల ఆరి్థక గణాంకాల వెల్లడికి ముందు మార్కెట్లలో అప్రమత్తత చోటు చేసుకోనే వీలుంది. అక్టోబర్లో రూ.20 వేల కోట్లు వెనక్కి ► విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్లో రూ.20,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. ఇదే కాలంలో డెట్ మార్కెట్లో రూ.6,080 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫెడ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి తర్వాత భారత మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ఏమిటనేది స్పష్టమవుతుంది. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. రేపు ఎఫ్ఓఎంసీ సమావేశం ప్రారంభం ► ద్రవ్య విధాన నిర్ణయాలు, వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 5.25 – 5.50% వద్ద యథాతథంగా ఉంచొచ్చని ఆరి్థకవేత్తల అంచనా. ద్రవ్య పాలసీ వెల్లడి సందర్భంగా చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను ఈక్విటీ మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఇదే మంగళ, బుధవారాల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లు సైతం ద్రవ్య సమీక్ష నిర్వహించనున్నాయి. -
డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూలై నెలలో నికర పెట్టుబడులను ఈ విభాగం ఆకర్షించగా.. ఆగస్ట్లో రూ.25,872 కోట్లు వీటి నుంచి బయటకు వెళ్లిపోయాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ముగియకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్లో పెట్టుబడుల పట్ల అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెట్లో 16 విభాగాలకు గాను 9 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్విడ్ ఫండ్స్ (రూ.26,824 కోట్లు), అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ (రూ.4,123 కోట్లు)లో ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇవన్నీ స్వల్పకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించిన పథకాలు. అలాగే, బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ విభాగం సైతం నికరంగా రూ.985 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఇక ఓవర్ నైట్ ఫండ్స్ రూ.3,158 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,325 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,755 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ఈ ఏడాది జూలైలో డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.61,140 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఈక్విటీల్లోకి పెట్టుబడులు.. ‘‘ప్రస్తుత వడ్డీ రేట్ల వాతావరణం, వడ్డీ రేట్ల గమనంపై నెలకొన్న అనిశి్చతితో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండే ధోరణి అనుసరించినట్టుగా ఉంది. అదే సమయంలో ఈక్విటీల్లో ర్యాలీ మొదలు కావడంతో డెట్ నుంచి పెట్టుబడులను అటువైపు మళ్లించినట్టున్నారు’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెలి్వన్ శాంటారియా వివరించారు. తాజా అమ్మకాలతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.14 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఇది రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది. -
దూకుడుకు బ్రేకులు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేకులు పడ్డాయి. బుధవారం మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడి దారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. బుధవారం ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 51979 వద్ద నిఫ్టీ 174 పాయింట్లు నష్ట పోయి 15464 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, హిందాల్కో,ఓఎన్సీజీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఫ్యూచర్తో రిలయన్స్ డీల్ క్యాన్సిల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ఆరంభమైంది. యూస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సూచీలు బలహీనంగా కదలాడాయి. వాటి ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో ఈ రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఏడాదికి పైగా కొనసాగుతున్న రియలన్స్, ఫ్యూచర్, అమెజాన్ వివాదం ముగింపుకు వచ్చింది. అమెజాన్ అభ్యంతరాల నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూపును కొనుగోలు చేయాలనే నిర్ణయం నుంచి రిలయన్స్ వెనకడుగు వేసింది. దీంతో రూ.24, 713 కోట్ల రూపాయల భారీ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఈ నిర్ణయం వెడివన వెంటనే ఫ్యూచర్ షేర్లు దారుణంగా నష్టపోయాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 20 శాతానికి పైగా ఫ్యూచర్ షేరు పతనమైంది. ఇటీవల కాలంలో దారుణంగా పతనమైన పేటీఎంను వెనక్కి నెట్టింది ఫ్యూచర్. మరోవైపు రిలయన్స్ షేరు ధర కూడా 2.4 శాతం మేర నష్టపోయింది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంచుమించు 400 పాయింట్ల నష్టంతో 56,757 పాయింట్ల వద్ద మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. స్మాల్, మిడ్, బ్లూచిప్ ఇలా అన్ని కేటగిరీల్లో నష్టాలు వచ్చాయి. మార్కెట్ ముగిసే సమయానికి 617 పాయింట్లు నష్టపోయి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 218 పాయింట్లు నష్టపోయి 16,953 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. చదవండి: నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్ను రద్దు చేసుకున్న రిలయన్స్..! -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం: బ్యాంక్ వినియోగదారులకు షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్, బొగ్గు వంటి కమోడిటీల సరఫరాకు సంబంధించి మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ అంకిత్ అగర్వాల్ తెలిపారు. ఇంధనాల ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్నాయని, ఇకపై మరింతగా పెరగవచ్చని పేర్కొన్నారు. ఫెడ్ రేట్లు మరికొంతకాలం యథాతథమే! ‘‘ఈ నేపథ్యంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ సహా సెంట్రల్ బ్యాంకులు..వడ్డీ రేట్ల పెంపును కాస్త వాయిదా వేసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఎగిసిందంటే వినియోగదారుల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు దెబ్బతింటాయి. కనుక ఇలాంటప్పుడు వడ్డీ రేట్లను వేగంగా పెంచితే ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. దేశీ మార్కెట్లు గణనీయంగా పెరిగిన దృష్ట్యా సాధారణంగానే ఎంతో కొంత కరెక్షన్కు గురవుతాయి. అందుకోసం వాటికి ఏదో ఒక కారణం అవసరమవుతుంది. అది ఈ రూపంలో వచ్చిందని భావించవచ్చు’’ అని అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఇన్వెస్ట్ చేయాలంటే మదుపునకు సంబంధించి రంగాల వారీగా చూస్తే నిర్మాణ మెటీరియల్స్, కన్జూమర్ సర్వీసులు, హెల్త్కేర్ మొదలైనవి సానుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక దేశీయంగా తయారీ కార్యకలాపాలు పెరుగుతున్న క్రమంలో పారిశ్రామిక రంగ సంస్థలు, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు, కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు మెరుగ్గా ఉండవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మిడ్క్యాప్ల పనితీరు అన్నది ఆయా సంస్థల ఆదాయాలపై ఆధారపడనుందని అగర్వాల్ వివరించారు. లాంగ్టర్మ్ బెస్ట్ ప్రస్తుతం మార్కెట్లో మదుపు చేద్దామనుకుంటే..దీర్ఘకాలిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందని, కనీసం 3–5 ఏళ్ల వ్యవధికి ఇన్వెస్ట్ చేయడం మంచిదని పేర్కొన్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఒడిదుడుకుల గురించి ఎక్కువగా ఆందోళన ఉండదని చెప్పారు. తమ కంపెనీపరంగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నవి లేదా టర్నెరౌండు సామర్థ్యాలు ఉన్న వాటిపై ఎక్కువగా దృష్టి పెడతామని, తద్వారా కాలక్రమంలో మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. -
తడబాటు తప్పదేమో..!
ముంబై: ఈ వారంలోనూ స్టాక్ మార్కెట్కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం (26న) మార్కెట్కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. జనవరి ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్క్యాప్, లార్జ్క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో గతవారంలో సూచీలు మూడున్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. వారం మొత్తంగా సెన్సెక్స్ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(జనవరి 25న) మొదలై.., 26వ తేదిన(బుధవారం)ముగియనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన వేళ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి, క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్ తీసుకొనే నిర్ణయాలు భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక ఈ వారంలో సుమారు 360 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో అధిక భాగం బ్యాంకింగ్ రంగానికి చెందిన కంపెనీలు. -
పసిడి ధరలు పటిష్టమే..!
న్యూఢిల్లీ/న్యూయార్క్: పసిడి బులిష్ ట్రెండ్ కనబడుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి .. ప్రత్యేకించి అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అమెరికా ఆర్థికాభివృద్ధి మళ్లీ మాంద్యంలోకి జారిపోతుందన్న అంచనాలు, దీనితో వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడ్ మొగ్గు చూపిస్తుందన్న విశ్లేషణలు పసిడికి బలాన్ని ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఒక తక్షణం ఒక సురక్షిత సాధనంగా ఎంచుకుంటున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్ల నేపథ్యంలో– శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ఒకేరోజు 28 డాలర్లు ఎగిసి 1,537 డాలర్లకు పెరిగింది. ఇది వారం వారీగా 16 డాలర్ల పెరుగుదల. 1,546 డాలర్లు ఈ ఏడాది గరిష్టం కావడం గమనార్హం. 1,360 డాలర్ల కీలక నిరోధాన్ని దాటిన తర్వాత పసిడి వేగంగా 1,546 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. రానున్న వారం రోజుల్లో పసిడి 1,600 డాలర్ల స్థాయిని చేరడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఇక దేశీయంగా చూసినా పసిడి రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా పసిడి బలపడ్డంతోపాటు, డాలర్ మారకంలో రూపాయి (శుక్రవారం 71.66 వద్ద ముగింపు)బలహీన ధోరణి కూడా దేశీయంగా పసిడికి కలిసివస్తోంది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ ఎంసీఎక్స్లో పసిడి ధర 10 గ్రాములకు రూ.38,765 వద్ద ఉంది. -
రెండో రోజూ లాభాల బాట
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 391 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ సగం వరకూ లాభాలను పోగొట్టుకొని చివరకు 157 పాయింట్ల లాభంతో 35,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 10,780 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్తో రూపాయి మారకం క్షీణించినా, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సందర్భంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నా, మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ముడి చమురు ధరలు మరింతగా దిగిరావడం కలసివచ్చింది. సగం తగ్గిన లాభాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్కు, అమెరికా అధ్యక్షుడి మధ్య ఉన్న ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలపడింది. అమెరికా వినియోగదారుల వినియోగ గణాంకాలు అంచనాలను మించడంతో బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ జోష్తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 391 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. అయితే ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన, లోహ, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో లాభాలు సగానికి తగ్గాయి. టాటా గ్రూప్ను దాటేసిన హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా గ్రూప్ను హెచ్డీఎఫ్సీ గ్రూప్ దాటేసింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.40లక్షల కోట్లకు చేరింది. ఇది టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ కంటే రూ.1,000 కోట్లకుపైగా అదనం. దీంతో దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ గల గ్రూప్గా హెచ్డీఎఫ్సీ గ్రూప్ అవతరించింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్లో ఐదు కంపెనీలు ఉండగా, టాటా గ్రూప్లో 30 వరకూ కంపెనీలున్నాయి. ఒక ఎనిమిది కంపెనీల షేర్ల తప్ప మిగిలిన అన్ని టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఈ ఏడాది బాగా పతనమయ్యాయి. అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ మొత్తం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్లో మూడింట రెండు వంతులు ఉంటుంది. -
రెండోసారి ఫెడరల్ బ్యాంక్లో భారీ దోపిడీ
-
రెండోసారి ఫెడరల్ బ్యాంక్లో దోపిడీ
హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్గిరిలో ఫెడరల్ బ్యాంక్లో చోరీ జరిగింది. దుండగులు రెండోసారి బ్యాంక్పై గురిపెట్టి...అందినకాడికి దోచుకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున దుండగులు బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. సుమారు లక్ష రూపాయల నగదుతో పాటు,ఒక కేజీ బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. గతంలోనూ ఇదే బ్యాంకులో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పాత నేరస్తులపై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా బ్యాంకులో వచ్చిన వారెవరైనా చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.