ఫ్లోరైడ్ సమస్యపైనే ప్రధాన దృష్టి: కేసీఆర్ | cm-kcr-on-media-conferance-after-cabinet-meeting | Sakshi
Sakshi News home page

Jun 10 2015 10:20 PM | Updated on Mar 20 2024 3:45 PM

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. 'దిండి, పాలమూరు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాం. గీత, మత్స్య కార్మికులకు రూ. 5 లక్షల బీమా, రిజిస్టర్డ్ సొసైటీలు మాత్రమే ఇస్తాం. మైనారిటీల కోసం 10 రెసిడెన్షియల్ స్కూళ్లు, 10 హాస్టళ్లు ఏర్పాటు చేస్తాం. సాంఘిక సంక్షేమ విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెడతాం. అనాథలకు తల్లీతండ్రి తెలంగాణ ప్రభుత్వమే. నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ పార్క్ ఏర్పాటు చేస్తాం' అని సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement