చంద్రబాబు.. నరేంద్ర మోదీల జోడీ గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఘనంగా చెప్పారు గానీ, ఇప్పుడు వాళ్ల జోడీ దేశానికి బోడిగా మారిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యేలా ఉంది తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని చెప్పారు.