పాక్ ప్రధాని షరీఫ్‌కు సుప్రీంకోర్టు షాక్ | big set back to pak pm nawaz sharif | Sakshi
Sakshi News home page

Nov 2 2016 7:15 AM | Updated on Mar 22 2024 10:40 AM

పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పనామా పత్రాల కుంభకోణంలో షరీఫ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. షరీఫ్ కుటుంబ సభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అన్వర్ జహీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పాక్ సుప్రీం ధర్మాసనం.. షరీఫ్‌పై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement