హిమాచల్లో ఆరో మృతదేహం లభ్యం | 6th-dead-body-found-in-himachal-pradesh | Sakshi
Sakshi News home page

Jun 11 2014 7:36 PM | Updated on Mar 21 2024 6:14 PM

హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో ఆరో మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం మృతదేహాన్ని బయటకు తీశారు. షబ్బీర్ హుస్సేన్గా గుర్తించారు. షబ్బీర్ హుస్సేన్ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. వారు మృతదేహాన్ని గుర్తించినట్టు తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి చెప్పారు. మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించనున్నట్టు తెలిపారు. ఇంతకుమందు ఐదు మృతదేహాలను గుర్తించి హైదరాబాద్కు తరలించారు. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు 24 మంది ఆదివారం సాయంత్రం బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా సహాయక బృందాలు గాలిస్తున్నా ఇంకా 18 మంది ఆచూకీ లభించలేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement