అఖిల భారత సర్వీసుకు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్రం వదిలివెళ్లిపోతున్నారు. గత రెండున్నరేళ్లలో పలువురు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోగా.. అదే బాటలో మరొక పది మంది హస్తిన బాటపడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి నచ్చకనే ఎక్కువ మంది రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారాంతపు సెలవులు, పండుగలనే తేడా లేకుండా ప్రతిరోజూ ప్రయోజనం లేని సమీక్షలతో గంటల తరబడి తమ సమయాన్ని సీఎం వృథా చేస్తున్నారని, ఆ సమీక్షలకు వెళ్లి చెప్పింది విని రావడం తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదనే భావన పలువురు ఐఏఎస్లలో వ్యక్తం అవుతోంది.
Dec 26 2016 7:40 AM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement