Sakshi News home page

తొలిసారిగా ఓ ముస్లిం నటుడికి ఆస్కార్‌

Published Mon, Feb 27 2017 9:13 AM

చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. డాల్బీ థియెటర్‌లో జరుగుతున్న ఈ 89వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్‌ పటేల్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్‌లైట్‌ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్‌ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్‌ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement