
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కడప అర్బన్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కడప నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గరికపాటి దీనబాబు అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కడపలోని జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయసేవాసదన్లో న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్న ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుంచా బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. యోగాలోని ఒక్కో ప్రక్రియ వల్ల ఒక్కో ఫలితం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మిత్ర యోగా కేంద్రం నిర్వాహకులు డాక్టర్ ఆర్. రంగనాథరెడ్డి న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగుల చేత యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి, కె.ప్రత్యూష కుమారి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి సి. ఆసిఫా సుల్తానా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం.రేష్మ పాల్గొన్నారు.
బీసీసీపీఎల్ ఆధ్వర్యంలో..
కమలాపురం : ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు యోగా చేయాలని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఎంఓ సాయి రమేష్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీసీపీఎల్లోని డీఏవీ పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పలు రకాల యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా అనే ఆంగ్ల అక్షరాల్లో ఇమిడి కనువిందు చేశారు. సీఎంఓ మాట్లాడుతూ భారతి డీఏవీ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా తదితర వాటిలో రాణించడం హర్షణీయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారంలో కనీసం రెండు రోజులైనా నిర్వహించాలని ఆయన ప్రిన్సిపల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కడప నాలుగవ అదనపు
జిల్లా న్యాయమూర్తి గరికపాటి దీనబాబు

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం