
ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెయ్యేరు సమీపంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన ఆకేటి శ్రీహరి(38) బైక్పై శనివారం రాత్రి కానుకొల్లు నుంచి ముదినేపల్లి వస్తున్నాడు. పెయ్యేరు సమీపానికి రాగానే రహదారి పక్కన నిలిపివున్న లారీ వెనుక భాగాన్ని చీకట్లో గమనించకుండా బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి