
532 మంది ఎస్జీటీలకు బదిలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు బుధవారం బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన 166 మందికి బదిలీ చేశారు. అనంతరం పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేస్తున్న 266 మందికి స్థానచలనం కల్పించారు. సాయంత్రం నుంచి జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు 100 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ప్రాతిపదికన కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. కౌన్సిలింగ్ గురువారం కూడా కొనసాగుతుందని విద్యాశాఖాధికారి తెలిపారు.