ఎంపీపీగా ధనలక్ష్మి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఎంపీపీగా ధనలక్ష్మి బాధ్యతల స్వీకరణ

May 29 2025 12:48 AM | Updated on May 29 2025 1:23 AM

ఎంపీపీగా ధనలక్ష్మి బాధ్యతల స్వీకరణ

ఎంపీపీగా ధనలక్ష్మి బాధ్యతల స్వీకరణ

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండల ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కోర్టు ఉత్తర్వులతో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఆమె వైఎస్సార్‌సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికై న సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మండలంలో అన్ని వర్గాలను కలుపుకుని మండలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎంపీపీగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించడానికి ప్రధాన కారణం తన వెంట ఉన్న ఎంపీటీసీ సభ్యులన్నారు. వారిని ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన వెరవకుండా తన వెంట నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఆమె స్వగ్రామం ఏనుగువానిలంక నుంచి భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా మండల పరిషత్‌ కార్యాలయం చేరుకున్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఎంపీపీ కుర్చీలో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌తోపాటు పార్టీ మండల కన్వీనర్‌ ఉచ్చుల స్టాలిన్‌బాబు, వైస్‌ ఎంపీపీ కొప్పాడి శ్రీనుబాబు, నాయకులు పొత్తూరి బుచ్చిరాజు, గుడాల సాయి బాలాజీ, చల్లా విశ్వేశ్వరరావు (నల్లయ్య), బోనం బులివెంకన్న, ఓదూరి భాస్కరరావు, చివటపు నాగేశ్వరరావు, ముదునూరి లక్ష్మీపతిరాజు, బొంతు కర్ణారెడ్డి, ఇలపకుర్తి నరసింహరావు, పొత్తూరి రంగరాజు, నిమ్మకాయల రామకృష్ణ, మంద హరికుమార్‌, మోకా నరసింహరావు, గుడాల సురేష్‌, మామిడిశెట్టి చిట్టిబాబు, మానుకొండ సోమరాజు, కోరాడ శ్రీనివాసరావు, జోగాడ ఉమామహేశ్వరరావు తదితరులు పూలమాల, శాలువాలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement