
కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ కార్యవర్గం ఎన్ని
తణుకు అర్బన్: కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం తణుకులో నిర్వహించారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు టి.రాము ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏలూరు డివిజన్ అధ్యక్షుడిగా పి.రాజేష్బాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్బాబు, జనరల్ సెక్రటరీ కె.సుధాకర్ ఆదేశాల మేరకు నూతన కార్యవర్గం ఏర్పడినట్లు చెప్పారు. కార్యదర్శిగా వై.నాగేంద్రప్రసాద్, కోశాధికారిగా బీవీ బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్కుమార్, ఆఫీస్ సెక్రటరీగా వై.జయశ్రీ, ఉపాధ్యక్షులుగా జి.సతీష్కుమార్, సీహెచ్ నరేష్, సహాయ కార్యదర్శులుగా కేఎన్ఎస్ యాదవ్, ఎం.రాజేష్ను ఎన్నుకున్నారు.
మట్టి ట్రాక్టర్ల అడ్డగింపు
ఉండి: ఉండి మండలం మహాదేవపట్నం గ్రామం రామచంద్రపురంలో అనుమతులు లేకుండా చెరువులో మట్టి తవ్వి ప్రైవేటు భూములు పూడుస్తున్న సుంకర శివ (వార్డు సభ్యుడు), సుంకర శ్రీనుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్నట్లు వీఆర్వో చిన్నారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా మట్టిని తీసుకువెళ్లి ప్రైవేట్ స్థలాన్ని పూడుస్తున్నారని ట్రాక్టర్లు అతివేగంతో తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఫిర్యాదు మేరకు అడ్డుకున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా తోలకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ కార్యవర్గం ఎన్ని