ఆయుర్వేద ఆసుపత్రికి కేంద్ర గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద ఆసుపత్రికి కేంద్ర గుర్తింపు

May 9 2025 12:55 AM | Updated on May 9 2025 12:55 AM

ఆయుర్వేద ఆసుపత్రికి కేంద్ర గుర్తింపు

ఆయుర్వేద ఆసుపత్రికి కేంద్ర గుర్తింపు

ఉంగుటూరు: ఉంగుటూరు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి కేంద్ర గుర్తింపు(నేషనల్‌ అక్రెడిషన్‌) లభించిందని, త్వరలో సర్టిఫికెట్‌ జారీ కానుందని వైద్యాధికారి కస్తూరి శిరీష గురువారం విలేకరులకు తెలిపారు. అనేక దీర్ఘ కాలిక, మొండి వ్యాధులకు ఆయుర్వేద వైద్యంలో ఉపశమనం లభిస్తుందన్నారు. ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో 25 పైగా ఔషధ మొక్కలు ఉన్నాయని, కటి వస్తి, జాను వస్తి, మొదలైన పంచకర్మ చికిత్సలు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరంగా అప్‌గ్రేడ్‌ అయ్యిందని, పంచకర్మ సెంటర్‌గా ప్రభుత్వం గుర్తించిందని డా.శిరీష పేర్కొన్నారు. తద్వారా ఖరీదైన, నాణ్యమైన ఔషధాలు, పంచకర్మ చికిత్సలను ఉచితంగా ప్రజలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement