
ఎద్దుల అక్రమ రవాణా.. అడ్డుకున్న పోలీసులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై ఎద్దుల అక్రమ రవాణాను పోలీసులు మంగళవారం అడ్డుకుని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. పార్వతీపురం మార్కెట్ నుంచి ఒక కంటైనర్లో 48 ఎద్దులను తమిళనాడులోని పోలచ్చి మార్కెట్కు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్ద కాపు కాసి, కంటైనర్ను అదుపులోకి తీసుకుని డ్రైవర్ మురుగానందంను అరెస్టు చేసి, వివరాలు రాబట్టారు. పట్టుబడ్డ కంటైనర్లో తరచూ ఆవులు, గేదెలను రవాణా చేస్తామని, ప్రస్తుతం పట్టుబడ్డ ఈ ఎద్దులను విజయనగరం జిల్లా, పెద్ద మానాపురం గ్రామానికి చెందిన రాజనా రామారావు సూచనల మేరకు పోలచ్చి మార్కెట్కు తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. అక్కడ కుంకుమరాజు అనే వ్యక్తికి ఫోన్ చేసి ఈ ఎద్దులను అప్పగించాల్సి ఉందన్నారు. ఇంతలో ఇక్కడ పట్టుబడినట్టు తెలిపాడు. దాంతో మురుగానందంతో పాటు, తమిళనాడులోని వట్టం సత్రం గ్రామానికి చెందిన కంటైనర్ యజమాని దండపాణి వెంకటాచలం, రాజనా రామారావు లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఎద్దులను నున్న గ్రామంలోని గోసంరక్షణ కేంద్రానికి తరలించినట్టు చెప్పారు.