
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
యలమంచిలి: మండలంలోని అబ్బిరాజుపాలెం గ్రామానికి చెందిన వలవల పవన్కుమార్ (21) పేరుపాలెం వద్ద సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం భీమవరంలో హాస్టల్లో ఉంటూ డీఎన్నార్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో భీమవరం నుంచి ఎనిమిది మంది స్నేహితులు కలసి పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. తెల్లవారుజామునే సముద్రం వద్దకు వెళ్లి స్నానానికి లోనికి వెళ్లారు. లోపలకు వెళ్లడంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు చూసి తాడు సహాయంతో ఇద్దరిని రక్షించారు. పవన్కుమార్ గల్లంతయ్యాడు. పవన్కుమార్ గల్లంతుతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వలవల రాముడు, రామ తులసి దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తి లేకపోయిన ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చాలా బాధాకరమని అబ్బిరాజుపాలెం సర్పంచ్ కామిశెట్టి సాయిబాబు చెప్పారు.