ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

Dec 10 2025 7:24 AM | Updated on Dec 10 2025 7:24 AM

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

వరంగల్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికారులు పటిష్ట ఏర్పాటు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ ఆదేశించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సీపీ.. పోలీస్‌ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందుగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఓట్ల లెక్కింపు సమయంలో స్టేషన్‌ అధికారులు తీసుకుంటున్న బందోబస్తు ఏర్పాటను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణపై సూచనలిచ్చారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రతీ పోలీస్‌ అధికారి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల సమయంలో పోలీస్‌ అధికారులు గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ పోలింగ్‌ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులకు సమచారం ఇస్తే అదనపు బలగాల్ని పంపిస్తామని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, లెక్కింపు పూర్తయ్యి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు ఎన్నికయ్యే వరకు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్‌, కవిత, రాజమహేంద్ర నాయక్‌తో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

సన్‌ప్రీత్‌ సింగ్‌

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement