
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
నర్సంపేట/నెక్కొండ: మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఏదో ఒక కుటీర పరిశ్రమతో అభివృద్ధి చెందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆశాజ్యోతి మండల సమాఖ్య 16వ మహాసభ, నెక్కొండ రైతు వేదికలో బుధవారం భారతీ మండల సమాఖ్య 17వ వార్షిక మహా సభ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆశాజ్యోతి మండల సమాఖ్యకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు, భారతీ మండల సమాఖ్యకు రూ. 15.10 లక్షల బ్యాంకు లింకేజీ రుణం చెక్కును అందించారు. చెన్నారావుపేటలో కడుదూరి హైమ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తహసీల్దార్ ఫణికుమార్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ మోహన్కాంత్, ఏపీఎం ముక్కెర ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు భూక్య గోపాల్నాయక్, మొగిలి వెంకట్రెడ్డి, చిన్నారెడ్డి, రమేశ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈశ్వర్, సీసీలు మంజుల, మాణిక్యం, కట్టయ్య, శ్రీలత, సుజాత, రజిత, సిబ్బంది పాల్గొన్నారు. నెక్కొండలో మహా సభ సమాఖ్య మండల అధ్యక్షురాలు మార్త లావణ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఏపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య ఓబీ నాగరాణి, పద్మ, సునీత, సీసీలు రవీందర్, ఏకాంబ్రం, శారద, వెంకట్, ఎస్ఎన్ లావణ్య, వివిధ గ్రామాల వీఓ ప్రతినిధులు, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
పలు మండల సమాఖ్య మహాసభలు