సంగెం: మండలంలోని గవిచర్ల గ్రామంలోని గల ఆయిల్పామ్ నర్సరీని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి జి.అనసూర్య బుధవారం సందర్శించి పరిశీలించారు. సెకండరి నర్సరీలో ఉన్న మొక్కలను పరిశీలించి చేపట్టాల్సిన ఎరువుల, నీటి యాజమాన్య పద్ధతులపై సూచనలు, సలహాలు అందించారు. కల్లింగ్ మొక్కలను తీసివేయాలన్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని రాంచరణ్ ఇండస్ట్రీస్ నర్సరీ ఇన్చార్జ్ కిరణ్కుమార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖాధికారి ఎన్. తిరుపతి, టెక్నికల్ సిహెచ్. రాకేష్, రాంచరణ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.