బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌

Jun 7 2025 1:36 AM | Updated on Jun 7 2025 1:36 AM

బక్రీ

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌

న్యూశాయంపేట: జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్‌ సత్యశారద ఈద్‌ ఉల్‌ అజ్‌హా(బక్రీద్‌) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్‌ పండుగ అని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కప్పతల్లీ.. వానలు కురిపించు

నర్సంపేట రూరల్‌ : కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లోని రైతులు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు విత్తుకున్నారు. వరుణుడు ముందే కరుణించాడని ఆనందపడిన అన్నదాతల ఆశలు నిరాశలు చేస్తూ వారం రోజులుగా వానలు పడడంలేదు. దీంతో విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వానలు పడాలని కోరుతూ నర్సంపేట మండలంలోని రాములునాయక్‌తండాకు చెందిన చిన్నారులు, ప్రజలు శుక్రవారం కప్పతల్లి ఆడారు. గ్రామస్తులంతా కప్ప, చిన్నారులపై నీళ్లారబోశారు. వర్షాలు సంవృద్ధిగా కురవాలని ప్రార్థించారు.

రెండు కేజీబీవీల్లో ఎంఎల్‌టీ కోర్సు

విద్యారణ్యపురి: జిల్లాలోని దుగ్గొండి, పర్వతగిరి కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం (2025–26) కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్‌ ఎంఎల్‌టీ (మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌) కోర్సును నూతనంగా ప్రవేశపెట్టినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేజీబీవీలో ప్రథమ సంవత్సరానికి 40 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల బాలికలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, చెన్నారావుపేట, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం కేజీబీవీల్లో సీఈసీ అండ్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందాలని ఆయన కోరారు.

అధ్యాపకులకు పీహెచ్‌డీ గైడ్‌షిప్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్‌ సిలబస్‌ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్‌ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్‌ డిగ్రీ అండ్‌పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్‌ డిగ్రీకళాశాలనుంచే పీహెచ్‌డీ గైడ్‌షిప్‌కోసం దరఖాస్తు చేసుకోవాల్సింటుంది. ఎంతమందికి గైడ్‌షిప్‌ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, లా విద్య (నాన్‌ ప్రొఫెషనల్‌, ప్రొఫెషనల్‌) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్‌ అయి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు కలిగిన విద్యార్ధులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో రెగ్యులర్‌ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వీరు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్‌వైజ్‌ స్కీం విద్యార్థులు బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్‌ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి,రామచంద్రం, వివిధ విభాగాల డీన్‌లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

వరంగల్‌ బస్‌స్టేషన్‌ ఆలస్యంపై అసహనం

వరంగల్‌ చౌరస్తా : వరంగల్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ నిర్మాణంలో ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్‌ స్టేషన్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతి, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్‌ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అదేవిధంగా భద్రకాళి బండ్‌ పరిసరాలను పరిశీలించారు.

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌
1
1/1

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement