బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి

Jun 7 2025 1:36 AM | Updated on Jun 7 2025 1:36 AM

బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి

బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: విద్యార్థుల పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నా రు. బడిబాట కార్యక్రమంపై కలెక్టరేట్‌లో శుక్రవా రం విద్యా, సంక్షేమశాఖలు, డీఆర్‌డీఓ, పంచాయ తీ, కార్మిక, మున్సిపల్‌, మెప్మా, తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత నెలలో నిర్వహించిన క్యాంపెయిన్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన నివేదికలను సమర్పించాలని ఎంఈఓలను కలెక్టర్‌ ఆదేశించారు. ఏఐ ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతుందని ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాల్లో 635 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటిలో 135 జీరో నమోదు పాఠశాలలు ఉన్నాయని ఆ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏపీఓ, మెప్మా, ఏపీఎంలు స్వయం సహాయక బృందాలు, అంగన్‌వాడీలను గ్రామసభల్లో భాగస్వాములను చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి మాట్లాడుతూ.. ఇటుక బట్టీల దగ్గర పనిచేసే పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. డీఈఓ జ్ఞానేశ్వర్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీపీఓ కల్పన పాల్గొన్నారు.

సమగ్ర వ్యవసాయ విధానంతో లాభాలు

నర్సంపేట: సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ఈ మేరకు కృషి విజ్ఞాన కేంద్రం మామునూర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్‌ కృషి సంకల్ప్‌ అభియాన్‌ యాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్‌ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్‌లో ఉన్న రైతులు వరి పంటను ఒక నెల ఆలస్యంగా వేస్తున్నారని ముందుగా వేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించాలని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ, చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. ఈ ప్రాంతంలో 1.8లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వికసిత్‌ కృషి సంకల్ప్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజన్న, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ కేవీకే, డాక్టర్‌ తమ్మి రాజు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ, ఏడీఏ దామోదర్‌, శాస్త్రవేత్తలు రాజు, సతీష్‌చంద్ర, తహసీల్దార్‌ ఫణికుమార్‌, మండల ఏఓ గోపాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

భూభారతి సదస్సు సందర్శన

అమీనాబాద్‌లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్‌ సత్యశారద సందర్శించారు. దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నెల 20వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఫణికుమార్‌, నాయబ్‌ తహసీల్దార్‌ రజని, గిర్దావర్లు మహ్మద్‌ రషీద్‌, మమత, జూనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ అంజద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్‌ రీజియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి కల్లెపు హరిప్రియ జిల్లాస్థాయి ద్వితీయ బహుమతి, చిత్రలేఖనంలో పోటీల్లో చిలపాక ద్రాక్షాయని ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు తేజావ త్‌ జయ శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, గైడ్‌ టీచర్లు గజవెల్లి సుందర్‌, సంతోష్‌కుమార్‌, రాగి శశిధర్‌, పిన్నింటి బాలాజీరావును అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement