
వరంగల్
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202
పొట్టేల్.. అధరహో..
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
ఖరీఫ్ పంటలు, విత్తనాల నాణ్యత, సాగు విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ఏడీఆర్
ఉమారెడ్డి తెలిపారు.
– 12లోu
కాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఏర్పడింది. ట్రై సిటీతో పాటు 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ పండుగ ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. వారు కొంత మాంసం వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్బానీ (దానం) ఇస్తారు.
పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలుగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి తాము అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు.
ధర రూ.5వేల నుంచి మొదలు

వరంగల్