రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు

May 28 2025 6:01 PM | Updated on May 28 2025 6:01 PM

రాష్ట్ర అవతరణ  వేడుకలకు ఏర్పాట్లు

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు

హన్మకొండ అర్బన్‌ : జూన్‌ 2వ తేదీన జిల్లాలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వై.వీ గణేష్‌ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు రమేష్‌, కె.నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 17న డాక్‌ అదాలత్‌

ఖిలా వరంగల్‌: జూన్‌ 17న పోస్టల్‌ సర్వీస్‌ విని యోగదారులకు 50వ ప్రాంతీయస్థాయి డాక్‌ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ గూగుల్‌ మీట్‌ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ బి.రవికుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌ జిల్లాల పరిధిలోని వరంగల్‌ డివిజన్‌కు సంబంఽధించిన తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్‌ ఎన్వలప్‌ కవర్‌పై 50వ డాక్‌ అదాలత్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (స్టాప్‌ అండ్‌ విజిలెన్స్‌) కె.శ్రీకాంత్‌, పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ హైదరాబాద్‌ రీజియన్‌, అడ్రస్‌ రాసి జూన్‌ 6వ తేదీలోగా చేరేలా పంపించాలని సూచించారు.

‘వాట్సాప్‌’తో విద్యుత్‌

సమస్య పరిష్కారం

హన్మకొండ : వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా విని యోగదారులు విద్యుత్‌ సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకు రావొచ్చని టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ, వరంగల్‌ సర్కిళ్ల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు మధుసూదన్‌ రావు, కె.గౌతం రెడ్డి తెలిపారు. వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా సమస్యలను పంపే వివరాలను వారు మంగళవారం వేర్వేరు ప్రకటనలో వివరించారు. వినియోగదారులు తమ మొబైల్‌ నుంచి 79016 28348 నంబర్‌కు హాయ్‌ అని చాట్‌ చేయగానే.. వెల్‌కమ్‌ టు టీజీ ఎన్పీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌ వస్తుందని, క్రమపద్ధతిలో వివరాలు ఇస్తే కంప్లయింట్‌ నమోదవుతుందని వివరించారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912 సంప్రదించి కూడా సేవలు పొందాలని సూచించారు.

నేటినుంచి 31వరకు రైల్వేగేటు మూసివేత

కమలాపూర్‌ : మండలంలోని ఉప్పల్‌–హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్యలో గల రైల్వేగేటును నేటినుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కాజీపేట సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర మరమ్మతులు చేపడుతున్న దృష్ట్యా నాలుగు రోజుల పాటు రైల్వేగేటు బంద్‌ ఉంటుందని పేర్కొన్నారు. దేశరాజుపల్లి, దండెపల్లి మార్గంలో ప్రయాణించే వాహనదారులు గమనించి రైల్వే శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

ముగిసిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

విద్యారణ్యపురి : ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు (జనరల్‌) మంగళవారంతో ముగిశాయి. ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఇంటర్‌ జనరల్‌ విభాగంలో ఫస్టియర్‌ పరీక్షకు 6,298 మంది విద్యార్థులకు 5,663 మంది(90శాతం) హాజరు కాగా 635మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement