
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
గోపాల్పేట: నిజామాబాద్లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్ 15 బాలుర ఫుట్బాల్ పోటీలకు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ సురేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ నెల 18న జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యారని.. జిల్లా నుంచి 18 మంది పాల్గొంటుండగా గోపాల్పేట విద్యార్థులు ప్రశాంత్, బాబునా యక్, సాయి మణికంఠ, మహేష్, చరణ్ ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పీడీతో పాటు ప్రధానోపాధ్యాయుడు రాందేవ్రెడ్డి అభినందించారు.