ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. | - | Sakshi
Sakshi News home page

ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..

Jun 27 2025 4:04 AM | Updated on Jun 27 2025 4:04 AM

 ముంద

ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..

డ్యాం క్రస్ట్‌గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్‌కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌శాఖ

ప్రభుత్వ నిర్లక్ష్యమే..

జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్‌గేట్ల రూప్‌లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం.

– చింతలన్న, నందిమళ్ల

గొర్రెలు కొట్టుకుపోయాయి..

2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల

పొంచి ఉన్న ముప్పు..

జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్‌ ఆశన్న, నందిమళ్ల

 ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. 
1
1/3

ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..

 ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. 
2
2/3

ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..

 ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. 
3
3/3

ముందస్తు వరదతో పనులకు అడ్డంకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement