సాగునీరు వృథా చేయొద్దు : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

సాగునీరు వృథా చేయొద్దు : ఎమ్మెల్యే

Jun 27 2025 4:04 AM | Updated on Jun 27 2025 4:04 AM

సాగునీరు వృథా చేయొద్దు : ఎమ్మెల్యే

సాగునీరు వృథా చేయొద్దు : ఎమ్మెల్యే

మదనాపురం: రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని రామన్‌పాడు రిజర్వాయర్‌ వద్ద ఉన్న సరళాసాగర్‌ ఎత్తిపోతల పథకం ప్రధాన మోటార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు అనేక విధాలుగా మేలు చేకూరుతుందని, పేదల ప్రభుత్వమని కొనియాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లెపాగ ప్రశాంత్‌, సమన్వయ కమిటీ అధ్యక్షుడు మహేష్‌, వివిధ గ్రామాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement