
నాగులకుంట కబ్జాపై నివేదిక ఇవ్వండి
అమరచింత: పుర పరిధిలోని నాగులకుంట కబ్జాపై సమగ్ర నివేదిక అందజేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రవికుమార్ యాదవ్ను ఆదేశించారు. గురువారం ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంటను పరిశీలించారు. కొన్నేళ్లుగా కుంట స్థలంలో మట్టి వేసి నీరు నిల్వకుండా కొందరు కబ్జా చేస్తున్నారని ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. మిషన్ కాకతీయలో చేపట్టిన కట్ట నిర్మాణం, ఆయకట్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కుంటలు, చెరువులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఈ ఆంజనేయులు, రైతులు ఉన్నారు.