
కోయిల్సాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేస్తుండటంతో ఆదివారం సాయంత్రం వరకు 17.6 అడుగులకు చేరింది. ఈ నెల 1న జూరాల వద్ద ఉన్న ఫేస్–1 ఉంద్యాల పంపుహౌస్ నుంచి ఒక పంపు ద్వారా నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి పర్దీపూర్ రిజర్వాయర్కు తరలించారు. ఆ తర్వాత 6న ఫేస్–2 తీలేర్ పంపుహస్కు వద్దకు చేరిన నీటిని అక్కడ ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 22 రోజులుగా కోయిల్సాగర్కు నీటి విడుదల కొనసాగుతుంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటిమట్టం 6.6 అడుగులు పెరిగి 17.6 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 9 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ వరకు 32.6 అడుగులుగా ఉండగా.. మరో 15 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది.