
రాష్ట్ర మహాసభలకు తరలిరావాలి
వనపర్తిటౌన్: టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల 8వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 24న హైదరాబాద్లో జరగనున్నాయని.. ఆర్టీసీలోని బీసీ కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సంఘం నాయకుడు వీవీ మూర్తి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని డిపో ఎదుట రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్పోస్టర్లను బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో బీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, కృష్ణయ్య, కిరణ్కుమార్, వెంకటేష్, సురేష్, శ్రీను, శ్రీనివాసులు, యాదగిరి, స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.