మహనీయుల ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయ సాధనకు కృషి

Jun 21 2025 2:52 AM | Updated on Jun 21 2025 2:52 AM

మహనీయుల ఆశయ సాధనకు కృషి

మహనీయుల ఆశయ సాధనకు కృషి

వీపనగండ్ల: మహనీయుల ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంతో పాటు కల్వరాల, గోవర్ధనగిరిలో ప్రజలు, యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ రచనకు అంబేడ్కర్‌ రేయింబవళ్లు శ్రమించి అంటరానితనాన్ని రూపుమాపి ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచారన్నారు. వారి ఆశయాల సాధనకు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను చైతన్యపర్చే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు వివరించారు. మండల కేంద్రంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో రూ.4 కోట్లతో మినీ స్టేడియం, రూ.50 లక్షలతో మోడల్‌ గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. కల్వరాలలో రూ.50 లక్షలతో గ్రామ కమ్యూనిటీహాల్‌, మండల కేంద్రంలోని గ్రంథాలయానికి రూ.2 లక్షలు, క్రీడలకు మరో రూ.2 లక్షలు, మిగతా గ్రామాల్లోని గ్రంథాలయాలు, క్రీడలకు రూ.2 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యాటక అధికారి నర్సింహ, బీరయ్యయాదవ్‌, నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య పాల్గొన్నారు.

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి..

రెవెన్యూ సదస్సుకు వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ వరలక్ష్మి ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 40 రోజుల్లో పరిష్కరించాలని.. రైతుల నుంచి ఎలాంటి డబ్బులు ఆశించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement