
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి
వనపర్తి రూరల్: బీజేపీ పాలనలోనే గ్రామాలు అభివృద్ధిచెందుతున్నాయని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే అందిస్తుండటంతో అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు పాపన్నగౌడ్ అన్నారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు నర్సింహనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయనతో పాటు కిసాన్మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి, కిరణ్, బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండిస్తున్న అన్నిరకాల ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర గణనీయంగా పెంచిందని.. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. మండలంలోని గ్రామాలకు వారబందీ విధానంలో సాగునీరు అందిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శ్రీరంగాపురం రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నీటితో నింపాలని కోరారు. రైతులకు కిసానన్ సమ్మాది నిధి పథకంలో భాగంగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్గౌడ్, మాధవరెడ్డి, వెంకట్రామారెడ్డి, భగవంతుయాదవ్, దేవేందర్నాయుడు, శివారెడ్డి, జమ్ములు, అజయ్గౌడ్ పాల్గొన్నారు.