ఎస్సీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ

Jun 6 2025 12:49 AM | Updated on Jun 6 2025 12:49 AM

ఎస్సీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ

ఎస్సీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ

విజయనగరం టౌన్‌:

స్సీ యువతీ, యువకులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పెదపూడి విజయకుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎస్సీల ఆర్థికాభివృద్ధికి ఈ ఏడాది రూ.340 కోట్లు బడ్జెట్‌ కేటాయించారని, ఈ నిధులతో ఎస్సీలకు ఉపయోగపడే రీతిలో స్వయం ఉపాధి పథకాలను రూపొందించి అమలుకు శ్రీకారం చుడతామన్నారు. సమావేశంలో ఎస్సీ మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కోండ్రు మరిడయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.వెంకటేశ్వరరావు, ఎస్సీ నాయకుడు ఆదాడ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

కుట్టుశిక్షణ మహిళలతో ముఖాముఖి

ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో కుట్టుశిక్షణ పొందుతున్న 30 మంది ఎస్సీ యువతలతో సమావేశమై శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులతో భేటీ అయి కార్పొరేషన్‌ ద్వారా అందుతున్న పథకాలపై ఆరా తీశారు. జిల్లాలోని ఎస్సీలకు (మాలలకు) అమలవుతున్న పథకాలపై కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌తో క్యాంపు కార్యాలయంలో చర్చించారు. కలెక్టరేట్‌ సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌ను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఆధునీకరించేందుకు అవసరమైన నిధులు మంజూరుకు కృషిచేస్తానన్నారు.

రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్‌

చైర్మన్‌ డాక్టర్‌ పెదపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement