కలెక్టర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్‌

Jun 12 2025 2:58 AM | Updated on Jun 12 2025 2:58 AM

కలెక్టర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్‌

కలెక్టర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్‌

మద్దిలపాలెం: విజయనగరం జోన్‌ వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా.. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌కు బుధవారం సమ్మెకు సంబంధించిన నోటీసు అందజేసినట్లు నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి పి.వి.మోహన్‌ తెలిపారు. ఈ నెల 8న జరిగిన జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. జోన్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సమ్మె నోటీసులు ఇవ్వాలని తీర్మానం చేశారన్నారు. ఈ నెల 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు సమ్మె నోటీస్‌ మెమోరాండంను సమర్పించామన్నారు. రాష్ట్ర కార్యదర్శి జి.ఆర్‌.రావు, జిల్లా కార్యదర్శి పిళ్లా శంకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు పి.ఎన్‌.మూర్తి, విజయనగరం మాజీ జోనల్‌ కార్యదర్శి ఎం.వి.ఆర్‌.మూర్తితో పాటు జోనల్‌లోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement