
కలెక్టర్కు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్
మద్దిలపాలెం: విజయనగరం జోన్ వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా.. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు బుధవారం సమ్మెకు సంబంధించిన నోటీసు అందజేసినట్లు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పి.వి.మోహన్ తెలిపారు. ఈ నెల 8న జరిగిన జోనల్ కౌన్సిల్ సమావేశంలో యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. జోన్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సమ్మె నోటీసులు ఇవ్వాలని తీర్మానం చేశారన్నారు. ఈ నెల 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు సమ్మె నోటీస్ మెమోరాండంను సమర్పించామన్నారు. రాష్ట్ర కార్యదర్శి జి.ఆర్.రావు, జిల్లా కార్యదర్శి పిళ్లా శంకర్రావు, జిల్లా అధ్యక్షుడు పి.ఎన్.మూర్తి, విజయనగరం మాజీ జోనల్ కార్యదర్శి ఎం.వి.ఆర్.మూర్తితో పాటు జోనల్లోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.