
ముక్కంటి సేవలో సినీ నటి శ్రియ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం సినీనటి శ్రియ దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి, స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు పాల్గొన్నారు.
రక్షణ సిబ్బంది అంటే
అపార గౌరవం
రేణిగుంట: రేణిగుంట మండలం, కుర్రకాల్వ సమీపంలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో డీజీఆర్ ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ వీడ్కోలు సమావేశంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఆయన డీజీఆర్ శిక్షణార్థులనుద్దేశించి మాట్లాడుతూ మాజీ సైనికుని కొడుకుగా రక్షణ సిబ్బంది పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. అనంతరం ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో ఆయన అన్ని వంటశాలలు, ప్రయోగశాలలను సందర్శించి, క్యాంపస్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. ఇన్స్టిట్యూట్ అకడమిక్ హెడ్ డాక్టర్ ఎం.త్రిలోక్ చందర్ తాము అందించే కోర్సులు, హాస్పిటాలిటీ, టూరిజం పరిశ్రమలో విద్యార్థులకు ఉన్న అవకాశాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ సిబ్బంది డాక్టర్ లోమ్టే దౌలత్రావు, చల్లేశ్వర్ రావు, విష్ణు ప్రియాదేవి, నిర్మల్శర్మ, మధుసూదన రాజు, బాబు పాల్గొన్నారు.
పలు కోర్సులకు
ఎన్బీఏ గుర్తింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని పలు కోర్సులకు న్యూఢిల్లీలోని మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్’ సంస్థ గుర్తింపును అందించింది. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలను మే 7, 8, 9 తేదీలలో ఎన్బీఏ బృందం పరిశీలించింది. విశ్వవిద్యాలయం నిర్వహించే సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలను సందర్శించింది. ఈ ఐదు శాఖలకు 2025 నుంచి 2028 వరకు మూడేళ్లు ఎన్బీఏ గుర్తింపు పొందినట్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, అధ్యాపకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ముక్కంటి సేవలో సినీ నటి శ్రియ

ముక్కంటి సేవలో సినీ నటి శ్రియ