
హస్తకళ బొమ్మలు లేపాక్షిలో విక్రయం
● చర్యలు చేపడుతామన్న కలెక్టర్ ● మాధవమాల కొయ్యబొమ్మల తయారీ యూనిట్ పరిశీలన
ఏర్పేడు: కొయ్య బొమ్మల తయారీ కళాకారులు సమిష్టిగా ఉండి మాధవమాలను ఒక బ్రాండ్గా తయారు చేయాలని, అందుకు హస్తకళ, కలంకారి కళాకారులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ప్రో త్సాహం అందిస్తామని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఏర్పేడు మండ లం, మాధవమాలలోని కొయ్యబొమ్మల తయా రీ బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ సొసైటీ యూనిట్ను ఆయన గురువారం సందర్శించారు. కలంకారీ వస్త్రాల తయారీ యూనిట్ను ఆయన పరిశీలించారు.
టూల్ కిట్స్ అందజేస్తాం
ప్రస్తుతం చేతి వృత్తి చేస్తున్న వారికి టూల్ కిట్స్ అందజేస్తామన్నారు. వారికి గుర్తింపు కార్డులు, లేపాక్షి వారితో మాట్లాడి విక్రయా లకు చర్యలు తీసుకుంటామన్నా రు. తిరుపతి విమానాశ్రయంలో నామ మాత్రపు ధరతో స్టాల్ ఏర్పాటునకు ఎయి ర్ పోర్ట్ అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామన్నారు. తిరుమలలో షాపులు ఏర్పాటునకు, టీటీడీ కల్యాణ మండపాలలో నామినల్ రేటుకి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు టీటీడీ ఈవోతో మాట్లాడుతానన్నారు. కర్లపూడి గ్రామంలోని కళాకారులకు మోటార్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఇళ్లు లేని కళాకారులను గుర్తించి వారికి మూడు సెంట్లు స్థలాన్ని అందించాలని తహసీల్దార్ భార్గవిని ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ ప్రభావతి, జిల్లా జీవనోపాదుల అధికారి టీ.ధనంజయరెడ్డి, తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్ వనజాక్షి, ఎస్వీఈపీ ఏపీ ఎం దూర్వాసులునాయుడు. ఏపీఎం కోమల, హస్తకళల సెక్రటరీ దశరదాచారి, శ్రీబాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూ చువల్ ఎయిర్ కో–ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు లోకనాథ ఆచారి, సెక్రటరీ రాజాచారి పాల్గొన్నారు.