జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం | - | Sakshi
Sakshi News home page

జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం

May 30 2025 1:19 AM | Updated on May 30 2025 1:19 AM

జగనన్

జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారు జామునే ఇంటి తలుపు తట్టి పింఛన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రేషన్‌ కార్డుదారుల ఇంటి గుమ్మం ముందే రేషన్‌ అందించేందుకు ఎండీ యూ వ్యవస్థకు పురుడుపోశారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులు అవస్థలు పడకుండా ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను మెరుగుపరిచారు. వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మహిళాభ్యున్నతికి రాయితీ రుణాలు అందించారు. పేదవారికి కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించారు. అమ్మ ఒడి, వసతిదీవెన, విద్యాదీవెన పథకాలను పకడ్బందీగా అమలు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మండల కేంద్రాల్లో మెగా జాబ్‌ మేళాలను ఏర్పాటు చేశారు. ఒక్కటేమిటి గ్రామ స్థాయిలో ఏ అవసరం వచ్చినా వెంటనే పరిష్కారమయ్యేలా వ్యవస్థలను తీర్చిదిద్దారు.

జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం1
1/1

జగనన్న పాలనలో గడపగడపలో ఆనందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement