
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 30,212 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 450 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 476 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారిసంఖ్య 8.24 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2,794 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.