Telangana: కొత్తగా 116 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 10,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 116 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 152 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ప్రస్తుతం 808 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.