తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు | More 1897 New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు

Aug 12 2020 9:05 AM | Updated on Aug 12 2020 4:57 PM

More 1897 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో  కొత్తగా 1897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1897 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 84,544కు చేరింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 654కు పెరిగింది.

కరోనా నుంచి కొత్తగా 1920 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 61,294 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 15,534 మంది హోం ,ఇతర ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంటున్నారు. రికవరీ రేటు దేశంలో 69.79 శాతం ఉండగా, తెలంగాణలో 72.49 శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement