
చిన్నపిల్లల పార్క్ ప్రారంభం
తిరువళ్లూరు: పట్టణంలోని 14వ వార్డులో రూ.43 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పార్క్ను స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఉదయమలర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్క్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పార్క్ల పర్యవేక్షణ బాధ్యతలను స్థానికులే స్వీకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అరుణ, జాన్, థామస్, డీఎంకే ఎన్ఆర్ఐ వింగ్ కార్యదర్శి జైకృష్ణ తదితరులు పాల్గొన్నారు.