కమనీయం..శ్రీనివాసుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం..శ్రీనివాసుడి కల్యాణం

Jun 23 2025 6:00 AM | Updated on Jun 23 2025 6:10 AM

కొరుక్కుపేట: చైన్నె మాధవరం పొన్నియమ్మన్‌మేడు మోహన్‌నగర్‌లో వెంకటాద్రి భజన సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస తిరు కల్యాణం అదివారం కనులపండువగా జరిగింది. ఉమియ మహల్‌ వేదికగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి మంగళశాసనాలతో సాగిన కల్యాణ మహోత్సవం చేశారు. కార్యక్రమానికి త్రిదండి ఆహోబిల రామానుజ జీయర్‌స్వామి పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలలోపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని తిరుకల్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. శ్రీమాన్‌ భక్త పార్థసారథి రామానుజర్‌ ఆశీస్సులతో శనివారం సాయంత్రం గరుడసేవ, శ్రీజన్మరక్షక హరినామ సుకీర్తనం, నాట్యాంజలి, భక్తిగీతాల ఆలాపన నిర్వహించారు. భజన సమాజం అధ్యక్షుడు కే పద్మరాజ్‌, కార్యదర్శి కే ఐశ్వర్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జెట్‌ చైన్నె కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

కమనీయం..శ్రీనివాసుడి కల్యాణం 1
1/1

కమనీయం..శ్రీనివాసుడి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement