
ఆధ్యాత్మిక వారసత్వానికి సాంస్కృతిక సహకారం
సాక్షి, చైన్నె : ఆధ్యాత్మిక వారసత్వాన్ని సమకాలీన రూపంలో మలిచేలా సాంస్కృతిక సహకారం దిశగా రామరాజ్ కాటన్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సాంస్కృతిక విద్యాంసులు దుష్యంత్ శ్రీధర్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. పంచెకు ప్రత్యేక గుర్తింపు కల్పించేలా ఉత్పత్తి రంగంలోకి ముందుకెళుతున్న రామరాజ్ కాటన్ మరో అడుగు ముందుకు వేసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వం, శాసీ్త్రయంగా ధరించగలిగే స్థిరత్వంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దుష్యంత్ శ్రీధర్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. గురువారం ఈ వివరాలను రామరాజ్ కాటన్ వ్యవస్థాపకులు కేఆర్ నాగరాజన్ స్థానికంగా ప్రకటించారు. నాలుగు వేల రకాల పంచెల తయారీ, విక్రయంలో ముందుకెళుతున్న తాము విస్తృత శ్రేణిలో గురువులు, ఆచార్యుల కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం సిద్ధం చేశామన్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశాన్ని దాటి ఈ ఉత్పత్తిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడం లక్ష్యంగా దుష్యంత్ శ్రీధర్ను అంబాసిడర్గా ఎంపిక చేశామన్నారు.