గ్యాస్‌ లీక్‌తో మంటలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీక్‌తో మంటలు

May 28 2025 11:59 AM | Updated on May 28 2025 11:59 AM

గ్యాస్‌ లీక్‌తో మంటలు

గ్యాస్‌ లీక్‌తో మంటలు

అన్నానగర్‌: వ్యాసర్‌పాడిలో గ్యాస్‌ లీక్‌ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సిలిండర్‌ పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చైన్నెలోని వ్యాసర్‌పాడి సత్యమూర్తి నగర్‌ ప్రధాన రహదారిపై 20కి పైగా గుడిసెలు ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున అక్కడ ఒక గుడిసెలో గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగాయి. గాలి రావడంతో మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించాయి. దీంతో ఇళ్లు కాలిపోయాయి. ఇళ్లలోని ప్రజలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఆ మంటల్లో ఒక ఇంట్లో ఉన్న సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వ్యాసర్‌పాడి, కొరుక్కుపేట, వాషర్‌మెన్‌పేట, ఎస్‌ప్లనేడు, వీఓసీ నగర్‌ సహా అగ్నిమాపక కేంద్రాల నుంచి ఆరు అగ్నిమాపక సిబ్బంది, అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఇందులో 20కి పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. వంటగదిలోని టీవీ, రిఫ్రిజిరేటర్‌ సహా వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, గాయాలు సంభవించలేదు. ఇల్లు కోల్పోయిన వారికి వ్యాసర్‌పాడిలోని ఒక పాఠశాలలో వసతి కల్పించారు. ఈ విషయంపై ఎంకేబీ నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

20 గుడిసెలు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement