1,008 పాల బిందెలతో ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

1,008 పాల బిందెలతో ఊరేగింపు

May 12 2025 6:49 AM | Updated on May 12 2025 6:49 AM

1,008

1,008 పాల బిందెలతో ఊరేగింపు

సేలం: నామక్కల్‌–తిరుమణి ముత్తార్‌ ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, వ్యవసాయం అభివృద్ధి చెందడానికి, ప్రజలు సుభిక్షంగా జీవించడానికి కొంగునాడు పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ తరఫున 1,008 పాలబిందెల ఊరేగింపు జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుచెంగోడ్‌ ఎమ్మెల్యే ఈశ్వరన్‌ ఊరేగింపును ఆదివారం ప్రారంభించారు. తిరుమణి ముత్తారు ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని, వ్యవసాయం, పారిశ్రామిక, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ 1,008 పాల బిందెలతో ఊరేగింపు నిర్వహించింది. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడ్‌లోని సీహెచ్‌పీ కాలనీ సమీపంలో ప్రారంభమైన ఊరేగింపును తిరుచెంగోడ్‌ ఎమ్మెల్యే, కొంగునాడు పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్‌ ప్రారంభించారు. కొంగునాడు పీపుల్స్‌ నేషనల్‌ పార్టీకి చెందిన మహిళలు ఒకే చీరలు ధరించి, పాలబిందెలు మోసుకెళుతూ ఊరేగింపుగా తిరుచెంగోడు కొండ దిగువన ఉన్న ఆర్ముగస్వామి ఆలయానికి చేరుకుంది. అక్కడ 1,008 పాల బిందెల్లో తెచ్చిన పాలతో మురుగన్‌ స్వామికి అభిషేకం చేశారు. 1,500 మందికి పైగా మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు.

1,008 పాల బిందెలతో ఊరేగింపు1
1/2

1,008 పాల బిందెలతో ఊరేగింపు

1,008 పాల బిందెలతో ఊరేగింపు2
2/2

1,008 పాల బిందెలతో ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement