
నకిలీ దస్తావేజులతో రుణం పేరిట రూ. కోటి మోసం
– బ్యాంక్ అధికారి అరెస్టు
తిరువొత్తియూరు: బ్యాంకులో కస్టమర్ల ఖాతాలను ఉపయోగించి నకిలీ దస్తావేజులతో రుణం పేరిట రూ. కోటి మోసం చేసిన బ్యాంకు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పెరంబులూరు జిల్లా లైప్పె కుడికాట్ లో కెనరా బ్యాంకు శాఖ ఉంది. ఇక్కడ నగల తాకట్టు విభాగంలో అధికారిగా రాజస్థాన్కు చెందిన ఆకాష్ గౌడ్ సౌఖాన్ (29) పనిచేస్తూ ఉన్నాడు. ఇతను బ్యాంకు కస్టమర్లు ఐదుగురి ఖాతాలపై నగలపై రుణం పొందినట్టు నకిలీ దస్తావేజులు తయారుచేసి అదనంగా నగదు రూ. కోటి మొత్తాన్ని తన బ్యాంకు ఎకౌంటుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంకు కార్యాలయ అధికారులు దస్తావేజులను తనిఖీ చేయగా ఆకాష్ సౌకాను నకిలీ ఆధారాలు సమర్పించి రుణం పొందినట్లు గుర్తించారు. దీనిపై నామక్కల్లోని బ్యాంక్ సహాయ జనరల్ మేనేజర్ కృష్ణ కుమార్ (46) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా క్రైం విభాగం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో ఆకాష్ షౌకాన్ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పెరంబులురు జిల్లా ప్రధాన క్రైమ్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.
ఇద్దరు అదనపు
న్యాయమూర్తులకు పదోన్నతి
సాక్షి, చైన్నె : మద్రాసు హైకోర్టులోని ఇద్దరు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించారు. వీరు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. మద్రాసు హైకోర్టులో సుమారు 75 మంది న్యాయమూర్తులు అవశ్యం. ప్రస్తుతం న్యాయమూర్తులుగా ఉన్నపలువురు ఈనెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఖాళీల సంఖ్య15కు పైగా తగ్గనుంది. దీంతో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హేమంత్ చందన్ , తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సురేందర్ను చైన్నెకు బదిలీ చేస్తూ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితులో హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న కుమార్, రాజశేఖర్ను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి పలువురు న్యాయవాదులు, న్యాయమూర్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.
హలో కిట్టి
సాక్షి, చైన్నె :ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఫ్రెండ్స్ ఫన్ ఫెయిర్ గాహలో కిట్టి ని ఏర్పాటు చేశారు. పిల్లల ఊహలకు ప్రాణం పోసే విధంగా సోమవారం అద్భుత వేడుక జరిగింది. ఇందులో కేంద్ర బిందువుగా అద్భుతమైన అలంకరణ తో – హలో కిట్టి, స్నేహితుల ప్రపంచంలోకి సందర్శకులను తీసుకెళ్ల విధంగా ఎత్తయిన సర్కస్ టెంట్లు, స్పిన్నింగ్ వీల్స్, కుషనన్ స్లైడ్లు, వీల్స్తో అలంకరణలోని ప్రతి అంశం పిల్లను ఆకర్షించే రీతిలో ఏర్పాట్లు చేశారు.
కండలేరు జలాలు విడుదల
రాపూరు : కండలేరు జలాశయం నుంచి సోమవారం చైన్నెకు నీటిని విడుదల చేశారు. తెలుగుగంగ ఎస్ఈ రాధాకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ మేరకు గంగమ్మకు పూజలు నిర్వహించి నీరు వదిలిపెట్టారు. ఎస్ఈ మాట్లాడుతూ చైన్నె వాసుల దాహార్తిని తీర్చడంతోపాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు , తిరుపతి జిల్లాల రైతులకు తాగు, సాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల కండలేరు జలాలను విడుదల చేశామన్నారు. ఏటా చైన్నె నగరానికి 5 టీఎంసీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కండేలరులో 45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. విడుదల చేసిన నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఈలు విజయకుమార్రెడ్డి, రాధాకృష్ణమూర్తి, రామచంద్రమూర్తి, డీఈఈ రేవతి, ఏఈలు తిరుమలయ్య, అనిల్బాబు పాల్గొన్నారు.

నకిలీ దస్తావేజులతో రుణం పేరిట రూ. కోటి మోసం