
ఘనంగా ప్రోవోక్ అవార్డులు –2025 ప్రదానోత్సవం
కొరుక్కుపేట: ప్రతిష్టాత్మక ప్రోవోక్ అవార్డులో ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో యువతరానికి స్ఫూర్తినిచ్చే ప్రముఖులను అవార్డులతో పాటూ పలువురికి జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. సినిమా, సంస్కృతి, వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్న వారికి ప్రోవోక్ అవార్డులు ఏటా అందిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా చైన్నెలో జరిగిన కార్యక్రమంలో 80కి పైగా అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో వేల్స్ యూనివర్సిటీ నిర్వాహకులు డాక్టర్ ఇషారి కె.గణేష్, నటుడు కె.భాగ్యరాజ్, నటుడు ఆర్. పార్థిబన్, నటి కుష్బూ సుందర్కు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు, నటుడు జీవీ ప్రకాష్, ఇంకా నటులు కలైయరసన్, సూరి, ప్రియా భవానీ శంకర్, ఐశ్వర్య రాజేష్కు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పాల్ సన్ మాట్లాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వారిని గుర్తించి ఏటా అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు.