
ప్రత్యేక ఇసుక క్వారీల కోసం ధర్నా
వేలూరు: ఉమ్మడి జిల్లాలోని ఎద్దుల బండి కార్మికులకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఇసుక క్వారీలు ఏర్పా టు చేయాలని కోరుతూ వేలూరు జిల్లా ఎద్దుల బండి కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులు మాట్లాడు తూ తాము పలు సంవత్సరాలుగా ఎద్దుల బండ్లను నమ్ముకొని జీవిస్తున్నామని తెలిపారు. అయితే ఎద్దుల బండిలో ఇసుక తీసుకొచ్చినా పోలీసులు తమపై కేసులు నమోదు చేయ డం, ఎద్దుల బండిని స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. దీంతో జీవనాధారం కోల్పోయి తమ కుటుంబాలు వీధిన పడు తున్నాయన్నారు. ఎద్దుల బండిలో ఇసుక తరలించేందుకు ప్రభు త్వమే ప్రత్యేకంగా ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తే వాటి నుంచి ప్రభుత్వానికి నగదు చెల్లించి ఇసుకను తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ ఇసుక క్వారీ ల్లో లారీలను మాత్రమే అనుమతించడం ద్వారా ఎద్దులనే నమ్ముకొని జీవిస్తున్న తాము ఎద్దులను పోషించలేక, వాటికి అవసరమైన ఆహారం పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.